Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు అమ్మాయిలు.. 20 మంది కామాంధులు.. 15 రోజులు.. గ్యాంగ్ రేప్!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (16:50 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో అత్యంత దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. 20 మంది కామాంధులు ఇద్దరు అమ్మాయిలను లోబరుచుకుని.. 15 రోజుల పాటు.. అనేక ప్రాంతాలను తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ రేప్ గురించి ఖాండ్వా జిల్లా ఎస్పీ ఎంఎస్ శికార్వర్ వెల్లడించిన వివరాల మేరకు.. 
 
రెండు వారల క్రితం ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి బస్సు ఎక్కారు. అదే బస్సులో ఉన్న నిందితుల్లో ఒకరు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు. తొలుత హోషంగాబాద్ తీసుకెళ్ళి ఒక ఇంట్లో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్, రేవా పట్టణాల్లో తిప్పారు. పదిహేను రోజులపాటు 20 మంది నరకం చూపారు.
 
ఒక ఇంట్లో ఉంచి బయట తలుపుకు తాళం వేయడం మరచి వారు బయటకు వెళ్లగా, ఇద్దరు అమ్మాయిలూ తప్పించుకు వచ్చి ఇల్లు చేరి, బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, వారిని ఉంచినట్టు అనుమానిస్తున్న అన్ని ప్రాంతాలకూ పోలీసు బృందాలను పంపినట్టు శికార్వర్ తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?