పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ చర్య .. బాంబు పేల్చిన యశ్వంత్ సిన్హా

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు మాటల తూటాలు పేల్చారు. గత యేడాది నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్యగా ఆయన అభ

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (14:22 IST)
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు మాటల తూటాలు పేల్చారు. గత యేడాది నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు. 
 
గుజరాత్‌లో జరిగిన 'లోక్‌షాహి బచావో అభియాన్‌' కార్యక్రమంలో సిన్హా మాట్లాడుతూ, 14వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్‌ మ‌హ‌మ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ 700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు తీసుకొచ్చారని గుర్తుచేశారు. 'ఎంతో మంది రాజులు తమ సొంత కరెన్సీని తీసుకొచ్చారు. మరికొంతమంది పాత కరెన్సీ పంపిణీ జరుగుతున్నా.. కొత్తవాటిని ప్రవేశపెట్టారు. 
 
కానీ 700 ఏళ్ల క్రితం తుగ్లక్‌ పాత కరెన్సీని రద్దు చేసి తన సొంత కరెన్సీని తీసుకొచ్చారు. అంటే 700 ఏళ్ల క్రితమే నోట్లరద్దు జరిగిందని తెలుస్తోందని' సిన్హా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆర్థికవ్యవస్థకు 3.75 లక్షల కోట్ల నష్టం జరిగిందని మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని, ఈ విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments