Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు.. ఆపై గొంతు కోసుకున్నాడు..

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:59 IST)
త్రిపురలో ఓ యువకుడు కిరాతకుడిగా మారాడు. 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హతమార్చాడు. అదే కత్తితో గొంతుకోసుకున్నాడు. ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్‌పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హత్యకు గురైన బాలికతో కార్తీక్ దేబ్‌నాథ్ అనే యువకుడికి ప్రేమ వ్యవహారం ఉందని పోలీసు అధికారి తెలిపారు.
 
బాలిక ఒంటరిగా తన పాఠశాలకు వెళుతున్నప్పుడు, దేబ్‌నాథ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో బాలుడు గొంతు కోసుకున్నాడు. ఆపై స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక మార్గమధ్యంలోనే మృతి చెందింది. 
 
తీవ్రంగా గాయపడిన కళాశాల విద్యార్థి దేబ్‌నాథ్‌ను ధర్మనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతను కూడా చికిత్స పొందుతూ మరణించాడు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments