Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు.. ఆపై గొంతు కోసుకున్నాడు..

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:59 IST)
త్రిపురలో ఓ యువకుడు కిరాతకుడిగా మారాడు. 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హతమార్చాడు. అదే కత్తితో గొంతుకోసుకున్నాడు. ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్‌పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హత్యకు గురైన బాలికతో కార్తీక్ దేబ్‌నాథ్ అనే యువకుడికి ప్రేమ వ్యవహారం ఉందని పోలీసు అధికారి తెలిపారు.
 
బాలిక ఒంటరిగా తన పాఠశాలకు వెళుతున్నప్పుడు, దేబ్‌నాథ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో బాలుడు గొంతు కోసుకున్నాడు. ఆపై స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక మార్గమధ్యంలోనే మృతి చెందింది. 
 
తీవ్రంగా గాయపడిన కళాశాల విద్యార్థి దేబ్‌నాథ్‌ను ధర్మనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతను కూడా చికిత్స పొందుతూ మరణించాడు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments