Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ఠాగూర్
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (15:21 IST)
సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండ వేడిమికి తల్లడిల్లిపోతుంటారు. ఇక స్కూల్ విద్యార్థులు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఢిల్లీలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు నెలకొంటాయి. ఎండవేడిమి, వడగాల్పులు, ఉక్కపోత కారణంగా ప్రజలు సతమతమవుతుంటారు. 
 
ఢిల్లీలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నడివేసవిలో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఢిల్లీ యూనివర్శిటికీ చెందిన లక్ష్మీభాయి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష్ వత్సల చేసిన వినూత్న పనికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఆవుపేడను స్వయంగా క్లాస్ రూమ్ గోడలన్నింటికీ పూశారు. ఇలా చేయడం వల్ల గోడలు వేడిని నిరోధించి చల్లదనాన్ని ఇస్తాయని తెలిపారు. వేసవిలో గదులను కూల్‌గా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ విధంగా ఆవుపేడ పూశామని, మరో వారం రోజుల్లో పరిశోధన వివరాలను తెలియజేస్తామని ప్రిన్సిపాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments