Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్' అంటూ హీరోయిన్‌తో కలిసి స్టెప్పులేని ఎంపీ (వీడియో)

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (14:29 IST)
బాలీవుడ్ హీరోయిన్‌ రవీనా టాండన్‌తో కలిసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అధికార టీఎంసీ ఎంపీ ఒకరు వేదికపై అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆయన పేరు సౌగతా రాయ్. కేంద్ర మాజీ మంత్రి. 77 యేళ్ళ వయసులో ఆయన వేసిన స్టెప్పులకు ఆ ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది. 
 
కోల్‌కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి రవీనా టాండన్‌తో పాటు.. ఎంపీ సౌగతా రాయ్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా తనతో కలసి డ్యాన్స్ చేయాలని సౌగతా రాయ్‌ను రవీనా కోరింది. దీంతో, రవీనాతో కలసి ఆయన ఉత్సాహంగా స్టెప్పులేశారు. 1994లో విడుదలైన సూపర్ హిట్ మూవీ 'మెహ్రా'లోని 'తూ చీజ్ బడీహై మస్త్ మస్త్' సాంగ్‌కు రవీనాతో కలసి కాలు కదిపారు. 
 
అంతేకాదు తమతో పాటు స్టెప్పులేయాలని వేదికపై ఉన్న ఇతర నేతలను కూడా రవీనా ఆహ్వానించింది. ఈ సందర్భంగా రవీనా మాట్లాడుతూ, డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఇంత జోష్‌గా ఉండే వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని తెలిపింది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments