Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. బెంగాల్ ఎమ్మెల్యే మృతి

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (12:47 IST)
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే వుంది. తాజాగా దేశంలో రికార్డు స్థాయికి చేరాయి.  గడచిన 24 గంటల్లో 15,968 కరోనా కేసులు నమోదు కాగా, 465 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది.

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 14,476 మంది ప్రాణాలు విడిచారు. 
 
కరోనా వైరస్ కారణంగా పశ్చిమబెంగాల్ లో ఓ ఎమ్మెల్యే మరణించారు. అంతకుముందే తమిళనాడులోనూ ఎమ్మెల్యే బలయ్యారు. జూన్ 23 వరకూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 73 లక్షల 52 వేల 911 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో తమోనష్ ఘోష్ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మూడుపార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. టీఎంసీ ఎమ్మెల్యే మృతికి సీఎంమమతా బెనర్జీ, పార్టీనేతలు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments