‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’ మోడీ : మరో ట్రంప్ అవుతారు.. మమతా హెచ్చరిక

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:55 IST)
ప్రధాని నరేంద్ర మోడీకి టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురైన పరాభవమే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు. 
 
గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన హుగ్లీ జిల్లా సహగంజ్‌లో బుధవాకం మమత బహిరంగ సభ నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. ‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’గా మోడీని అభివర్ణించారు. 
 
అమిత్ షా, మోడీ ఇద్దరూ కలిసి అసత్యాలను ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మోడీ అవకాశవాది అని, అల్లర్ల సృష్టికర్త అని ఆరోపించిన మమత.. కోట్ల రూపాయలకు దేశాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
 
టీఎంసీ కమీషన్లు (కట్ మనీ) తీసుకుంటుందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు మరి దీనినేమంటారని ప్రశ్నించారు. క్యాట్ మనీ అంటారా? లేక, ర్యాట్ మనీ అంటారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి మరోమారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments