తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం వెలసి వున్న తిరువణ్ణామలైలో భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తిరువణ్ణామలైలోని గుగై నమశ్శివాయ ఆలయంలో ప్రహరీ గోడ విరిగిపడింది. ఈ ఘటనలో భక్తులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.
అంతకుముందు కొండచరియలు విరిగిపడటంతో ఒక బండరాయి నివాస భవనంపై పడి ఏడుగురు సభ్యులతో కూడిన కుటుంబం శిధిలాల్లో చిక్కుకుంది. ఫెంగల్ తుఫాను రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో తీరం దాటిన తర్వాత వారాంతం నుండి దక్షిణాది రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తోంది.