Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో నిమ్న వర్గాలపై కొనసాగుతున్న వివక్ష : మోహన్ భగవత్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (17:22 IST)
మన సమాజంలో నిమ్నవర్గాలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతుందని ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ అన్నారు. అందువల్ల దేశంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ తరం వృద్ధాప్యానికి చేరుకునేలోపే అఖండ భారత్ వాస్తవరూపం దాలుస్తుందన్నారు. 1947లో మన దేశం నుంచి విడిపోయిన వారిలో ఇప్పుడు తప్పు చేశామన్న భావనలో ఉన్నారని గుర్తు చేశారు.
 
'మన సాటి వారినే మనం వెనక్కు నెట్టేశాం. వారిని పట్టించుకోలేదు. ఇది ఏకంగా 2 వేల ఏళ్ల పాటు సాగింది. వారికి సమానత్వం కల్పించే వరకూ కొన్ని ప్రత్యేక ఉపశమనాలు కల్పించాల్సిందే. రిజర్వేషన్లు ఇందులో భాగమే. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది. 
 
రెండు వేల ఏళ్ల పాటు కొన్ని వర్గాలు వివక్షను ఎదుర్కొన్నాయి. వారి మేలు కోసం ఓ 200 సంవత్సరాల పాటు మనం చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోలేమా? అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మనకు కనిపించకపోయినా సమాజంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆయన గుర్తు చేశారు. సమాజంలో వివక్ష కొనసాగుతుందని మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments