Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతి చేతిలో ఓడిపోయిన ప్రజలు.. ఎలా?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (16:26 IST)
ఓ వానరం దెబ్బకు ఓ గ్రామంలోని ప్రజలంతా తమ ఇళ్లు ఖాళీ చేసి పారిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని సీర్గాళికి సమీపంలో తెన్నల్‌కుడి ఊరిలో కన్నికోయిల్ వీధిలో దాదాపు 60 కుటుంబాల ప్రజలు నివశిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఊరికి ఓ కోతి వచ్చింది. ఈ కోతి తన చేష్టలతో హంగామా చేయడం, ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం వంటి పనులు చేయసాగింది. ఎవరైనా అడ్డుకోబోతే... వారిపై దాడి చేయసాగింది. ఇలా ఈ కోతి దాడిలో గాయపడిన వారు 20 మందికి పైగానే ఉన్నారు. 
 
అంతేకాదు మనుషులతోపాటు గ్రామంలోని పశువులపై దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతో తోపాటు భయాందోళనకు గురయ్యారు. కోతిని పట్టుకుని తమను దాని బారి నుంచి కాపాడాలంటూ అటవీ శాఖ అధికారులను కోరారు.
 
వానరాన్ని పట్టుకునేందుకు అధికారులు కన్నికోవిల్‌ వీధిలో బోన్లను ఏర్పాటు చేశారు. అయినా అది చిక్కక పోగా… దాని ఆగడాలు మరింత ఎక్కువ కావడంతో స్థానికులు అన్నీ సర్ధుకుని,ఇళ్లకు తాళాలు వేసి గ్రామాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈ కోతి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న అటవీశాఖ అధికారులు ఆ వానరాన్ని బంధించే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments