Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డు సృష్టించనున్న యూపీ ఆర్టీసీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:09 IST)
బస్సులతో గిన్నీస్ రికార్డ్‌కు ప్రయత్నిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ముగింపును మాత్రం మరింత ఆకట్టుకునే రీతిలో ఉండేలా ప్లాన్ చేసింది. 
 
పవిత్ర గంగానది వెంట దాదాపు 8 కిలోమీటర్ల పొడవునా 40 స్నాన ఘట్టాల్ని నిర్మించారు. భద్రత కోసం దాదాపు 20 వేల మంది సైనికులను వినియోగిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో భక్తులు స్నానాలు ఆచరించే 100 మీటర్ల పరిధిలో ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించడాన్ని అధికారులు నిషేధించారు. పైగా, ఈ కుంభమేళాకు భారీ స్పందన వచ్చింది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. 
 
మార్చి 4వ తేదీన మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో దాదాపు 500 బస్సులతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం ప్రయత్నం చెయ్యబోతోంది. ఆ బస్సుల మీద కుంభమేళా లోగోను కూడా ఏర్పాటు చేసింది. బస్సులన్నీ వరుస క్రమంలో ఒకదాని వెనుక ఒకటి వెళ్లబోతున్నాయి. ఈ బస్సుల వరుస ఏకంగా 3.2 కిలోమీటర్ల దూరం ఉండబోతోంది. ప్రపంచంలో ఇంత పెద్ద బస్సుల వరుస ఇప్పటివరకూ లేదు. అందువల్ల ఇది గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments