Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డు సృష్టించనున్న యూపీ ఆర్టీసీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:09 IST)
బస్సులతో గిన్నీస్ రికార్డ్‌కు ప్రయత్నిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ముగింపును మాత్రం మరింత ఆకట్టుకునే రీతిలో ఉండేలా ప్లాన్ చేసింది. 
 
పవిత్ర గంగానది వెంట దాదాపు 8 కిలోమీటర్ల పొడవునా 40 స్నాన ఘట్టాల్ని నిర్మించారు. భద్రత కోసం దాదాపు 20 వేల మంది సైనికులను వినియోగిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో భక్తులు స్నానాలు ఆచరించే 100 మీటర్ల పరిధిలో ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించడాన్ని అధికారులు నిషేధించారు. పైగా, ఈ కుంభమేళాకు భారీ స్పందన వచ్చింది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. 
 
మార్చి 4వ తేదీన మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో దాదాపు 500 బస్సులతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం ప్రయత్నం చెయ్యబోతోంది. ఆ బస్సుల మీద కుంభమేళా లోగోను కూడా ఏర్పాటు చేసింది. బస్సులన్నీ వరుస క్రమంలో ఒకదాని వెనుక ఒకటి వెళ్లబోతున్నాయి. ఈ బస్సుల వరుస ఏకంగా 3.2 కిలోమీటర్ల దూరం ఉండబోతోంది. ప్రపంచంలో ఇంత పెద్ద బస్సుల వరుస ఇప్పటివరకూ లేదు. అందువల్ల ఇది గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments