Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరంగాబాద్‌లో విషం తాగిన ఆరుగురు యువకులు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (09:25 IST)
బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో ఆరుగురు యువతులు విషం సేవించారు. వీరిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మిగిలినవారి పరిస్థితి విషమంగా ఉంది. ఓ యువకుడు ప్రేమించిన యువతిని పెళ్లి చేసేకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి విషం సేవించింది. దీన్ని చూసిన మరో ఐదుగురు యువతులు కూడా విషం సేవించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బిహార్‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్, కాస్మా ప్రాంతానికి చెందిన ఆరుగురు యువతులు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వీరిలో ఓ బాలిక యువకుడితో ప్రేమలోపడింది. అయితే ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి బలవాన్మరణానికి పాల్పడేందుకు విషం సేవించింది. అది చూసిన మిగతా ఐదుగురు యువతలు కూడా విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. 
 
ఈ ఘటనలో ముగ్గురు బాలికలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మగధ్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
బాలికలందరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారని వారి వయసు 12 నుంచి 16 యేళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. మిగిలిన ఐదుగురు అమ్మాయిలు ఎందుకు విషం సేవించారన్న అంశంపై విచారణ జరుపుతున్నట్టు ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments