Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె లవ్‌ఎఫైర్.. చున్నీతో గొంతునొక్కి చంపేసిన కసాయి తండ్రి!

Webdunia
సోమవారం, 23 జూన్ 2014 (16:03 IST)
కూమార్తె ఓ యువకుడితో ప్రేమలో పడటంతో ఆ విషయం ఏవరికైనా తెలిస్తే పరువుపోతుందని తన ఇద్దరు కుమారులతో కలిసి కన్న కూతుర్ని హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ దారుణ సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకెళితే...

స్థానికంగా ఉంటోన్న మినతి దలాయ్ అనే 19 ఏళ్ల యువతికి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొద్దికాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం మినతి తండ్రి సూర్య దలాయ్‌కు తెలియడంతో ఆమెను మందలించాడు. అయినా మినతి తరచూ ప్రియుడ్ని కలవడంతో సూర్య దలాయ్‌కు ఆగ్రహం వచ్చింది.

కూతురి వ్యవహారం బయటపడితే తన పరువు పోతుందని ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. తన ఇద్దరు కొడుకుల సహాయంతో చున్నీతో పీక నొక్కి హత్య చేశాడు. అంతేకాకుండా ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పారు. కానీ ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. యువతిని హత్య చేసిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments