నాసిక్‌కు దండుగా కదిలిన రైతులు ... నేడు భారీ బహిరంగ సభ

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (13:39 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉధృతంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా అనేక రాజకీయ పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన మహారాష్ట్రలోని 21 జిల్లాల రైతులు మొన్న (శనివారం) నాసిక్‌లో కలుసుకున్నారు.
 
కాగా, ఈ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న విషయం తెల్సిందే. 
 
‘ఆల్ ఇండియా  కిసాన్’ సభ పేరుతో ఒక్కటైన రైతులు వేలాదిమంది జెండాలు, బ్యానర్లతో నాసిక్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ముంబై చేరుకున్నారు. సోమవారం ఆజాద్ మైదానంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ హాజరవుతారు. 
 
మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో రైతులు నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లభించింది. ఇందుకోసం వందలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. గణతంత్ర వేడుకల తర్వాత రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. 
 
ప్రతి ట్రాక్టర్‌పై జాతీయ జెండా ఉంటుంది. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రి, ఘాజీపూర్, పల్వాల్, షాజహాన్‌పూర్ సరిహద్దుల నుంచి ట్రాక్టర్ ర్యాలీ మొదలవుతుంది. అవుటర్ రింగు రోడ్డులో 100 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సాయంత్రం ర్యాలీ ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments