Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపాలీశ్వర స్వామి కొలనులో కార్తీక దీపాలు: చచ్చి తేలియాడుతున్న చేపలు

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (18:39 IST)
fishes
తమిళనాడు రాజధాని చెన్నై, మైలాపూర్‌లో కపాలీశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే మైలాపూరులో కేశవ పెరుమాళ్ల వారి ఆలయం వుంది. ఈ ఆలయంలోని కొలనుకు చిత్తిరై కొలను అనే పేరుంది. ఈ కొలనులోని తీర్థం పాపాలను హరిస్తుందని విశ్వాసం. 
 
తాజాగా కపాలీశ్వర ఆలయంలోని కొలనుతో పాటు చిత్తిరై కొలనులో చేపలన్నీ చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. కొలను లోని చేపలన్నీ ఇలా చనిపోయి.. చేపలతొట్టెలా కనిపించడం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. కొలను మొత్తం చనిపోయిన చేపలు తేలియాడటం చూసి భక్తులు షాకవుతున్నారు.
 
కార్తీక మాసం కావడంతో పుణ్య స్నానాల కోసం కొలనుకు వచ్చే భక్తులు చనిపోయిన చేపలతో కూడిన కొలను చూసి బాధపడిపోతున్నారు. కాగా కొలనులో ఇలా భారీ ఎత్తున చేపలు ఎలా చనిపోయి వుంటాయనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. కాగా భక్తులు వెలిగించిన కార్తీక దీపాల నూనె కొలను నీటిలో కలిసి చేపలు చనిపోయి వుంటాయన్న వాదన వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments