Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యం కాలుష్య నగరాల జాబితా రిలీజ్.. వైజాగ్‌కు చోటు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (10:11 IST)
దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు నగరాల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి విశాఖపట్టణం కాగా, మరొకటి హైదరాబాద్ నగరం. 
 
అయితే, దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బీహార్ రాష్ట్రంలోని కతిహార్ నగరం మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే, ఏపీలోని విశాఖపట్టణం, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ఓ జాబితాను రిలీజ్ చేసింది. 
 
సీపీసీబీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరాల్లో కతిహార్‌లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోగా, ఢిల్లీ 354, నోయిడాలో 328, ఘజియాబాద్‌లో 302 పాయింట్లతో వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్టణం, హైదరాబాద్ నగరాలు కూడా కాలష్య కోరల్లో చిక్కుకుని ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. విశాఖలోని గాలి నాణ్యత 202 పాయింట్లుగా ఉండగా, హైదరాబాద్ నగరంలో ఇది 100 పాయింట్లుగా ఉంది. ఇక అనంతపురంలో 145, తిరుపతిలో 95, ఏలూరులో 61 పాయింట్ల చొప్పున ఉంది.
 
అదేవిధంగా బీహార్‌లోని బెగుసరాయ్, హర్యానాలోని బల్లాబ్‌గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కూడా కాలుష్య కారక నగరాల జాబితాలో చేరాయి. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments