Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

ఐవీఆర్
మంగళవారం, 21 మే 2024 (14:09 IST)
పాములు పగపడతాయా? ఏళ్లకు ఏళ్లయినా వదలకుండా వెంటాడుతాయా? అంటే అవునని అంటున్నారు ఆ రాష్ట్రంలోని గ్రామవాసులు. పూర్తి వివరాలను చూస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా బహరోబంద్ పరిధిలోని గుణబచ్చయ్య గ్రామంలో ఓ కుటుంబంలోని మహిళపై పాము పగబట్టిందట. మే 10వ తారీఖును ఆమె ఇంట్లో పని చేసుకుంటుండగా త్రాచుపాము కాటు వేసింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఐతే సదరు మహిళను పాము కాటు వేయడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.
 
గత ఆరేళ్లుగా ఆమెను అదను చూసి పాము కాటు వేస్తోందనీ, ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుకుంటున్నట్లు చెప్పారు. ఆ పాము మహిళపై ఎందుకు పగ పట్టిందో తెలియడం లేదని వాపోతున్నారు. మరోవైపు మహిళను కాటు వేసిన పాము ఒక్కటేనా లేదంటే అనేక పాములు ఒక్కోసారి కాటు వేసాయా అనే విషయంపై ఆ గ్రామ వాసులు చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద సదరు మహిళ మాత్రం తనను పాము ఎప్పుడు కాటు వేస్తుందో అని భయంతో వణికిపోతుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments