Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

ఐవీఆర్
మంగళవారం, 21 మే 2024 (14:09 IST)
పాములు పగపడతాయా? ఏళ్లకు ఏళ్లయినా వదలకుండా వెంటాడుతాయా? అంటే అవునని అంటున్నారు ఆ రాష్ట్రంలోని గ్రామవాసులు. పూర్తి వివరాలను చూస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా బహరోబంద్ పరిధిలోని గుణబచ్చయ్య గ్రామంలో ఓ కుటుంబంలోని మహిళపై పాము పగబట్టిందట. మే 10వ తారీఖును ఆమె ఇంట్లో పని చేసుకుంటుండగా త్రాచుపాము కాటు వేసింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఐతే సదరు మహిళను పాము కాటు వేయడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.
 
గత ఆరేళ్లుగా ఆమెను అదను చూసి పాము కాటు వేస్తోందనీ, ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుకుంటున్నట్లు చెప్పారు. ఆ పాము మహిళపై ఎందుకు పగ పట్టిందో తెలియడం లేదని వాపోతున్నారు. మరోవైపు మహిళను కాటు వేసిన పాము ఒక్కటేనా లేదంటే అనేక పాములు ఒక్కోసారి కాటు వేసాయా అనే విషయంపై ఆ గ్రామ వాసులు చర్చించుకుంటున్నారు. మొత్తమ్మీద సదరు మహిళ మాత్రం తనను పాము ఎప్పుడు కాటు వేస్తుందో అని భయంతో వణికిపోతుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments