Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీస్ సినిమా విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతం.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక

Webdunia
గురువారం, 4 మే 2023 (09:22 IST)
తమిళనాడులో ది కేరళ స్టోరీస్‌ చిత్రం విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సినిమా ట్రైలర్‌ ఏప్రిల్‌ 6వ తేదీన విడుదలై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది యథార్థ సంఘటన అని, ఇప్పటివరకు 32 వేల మంది మహిళలు మతం మారినట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమాకు నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన దేశవ్యాప్తంగా విడుదలకానుంది. తమిళనాడులో ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని రాష్ట్ర పోలీసుశాఖను నిఘా వర్గాలు హెచ్చరించాయి. శాంతిభద్రతలకు సమస్య ఏర్పడుతుందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపింది. సినిమా రాష్ట్రంలో విడుదలకాకుండా చూడడం మంచిదని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్చించి నిర్ణయం తీసుకుంటారని పోలీసు వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments