Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారటోరియంపై సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది: కేంద్రంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (09:16 IST)
రెండు కోట్ల రూపాయల లోపు బ్యాంకు రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీని జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రుణాలకు వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేసేందుకు నెల ఆలస్యం ఎందుకంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.
 
తీసుకున్న నిర్ణయాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి, చిన్నచిన్న మొత్తాలలో రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరేలా, అన్ని నియమనిబంధనలకు అనుగుణంగా, నిర్ణయాలు తీసుకునేందుకు సమయం కావాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కేంద్రం వాదనలతో ఏకీభవించని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
 
రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులు ఉంటాయని, బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు 
సొలిసినటరీ జనరల్‌ కోర్టుకు సమాధానం ఇవ్వగా కేంద్ర నిర్ణయం అమలుపై సామాన్యుల్లో ఆందోళన నెలకొని వుందని, “సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి జస్టిస్ ఎమ్.ఆర్. షా వ్యాఖ్యానించారు.
 
నవంబరు 15వరకు సమయం ఇవ్వాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరినా, నవంబరు 2ను డెడ్‌లైన్‌గా సుప్రీం ధర్మాసనం చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments