Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్గాంలో టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Webdunia
గురువారం, 26 మే 2022 (10:04 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల పెట్రేగిపోతున్నారు. ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 60 మందికిపైగా ఉగ్రవాదులు ఉన్నట్టు కాశ్మీర్ ఐజీ విజయకుమార్ వెల్లడించారు. దీంతో ఈ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలలో ఓ టీవీ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. 
 
బుధవారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్‌ జుబైర్ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె మరణించగా, బాలుడు గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడిని జుబైర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఇదిలావుంటే బుధవారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. తాజాగా కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు కలిసి ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments