Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీని చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది : శరద్ పవార్

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (10:31 IST)
నా చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగానని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీని చూస్తుంటే తనకు వెన్నులో వణుకు పడుతోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మోడీని చూస్తుంటే తన వెన్నులో వణుకు పుడుతోందని, భయంతో కంపించిపోతున్నానని చెప్పుకొచ్చారు. 
 
తన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగానని మోడీ చెప్పారని, కానీ ఇప్పుడు అదే మోడీని చూస్తుంటే తనకు భయం వేస్తోందన్నారు. మోడీ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఏమోనని, ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదని శరద్ పవర్ వ్యాఖ్యానించారు. 
 
గత యూపీఏ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న శరద్ పవార్... గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ప్రతి విషయంలో సహకరించేవారని 2016లో పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో నరేంద్ర మోడీ చెప్పారు. దీన్ని గుర్తు చేసిన శరద్ పవార్... ఇపుడు మోడీని చూస్తుంటే ఇప్పుడు తనకు భయం వేస్తోందంటూ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
 
శరద్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా శనివారం దాంద్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న పవార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మోడీ ఏడు సభల్లో ప్రసంగించారని, ప్రతి సభలోనూ తనపైనే విమర్శనాస్త్రాలు సంధించారని పవార్ వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments