Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటలోని మామిడి పండ్లు కోశారనీ.. బాలుడిని కాల్చి చంపాడు.. ఎక్కడ?

నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (11:09 IST)
నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
బీహార్‌లోని ఖగారియా జిల్లా పాత్రాహా గ్రామంలో పిల్లలంతా సమీపంలోని మామిడి తోటలో ఆడుకుంటారు. గురువారం తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన సత్యం కుమార్... తోటలో మామిడి పండ్లు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో తోట కాపలా కాస్తున్న రామాశీష్ యాదవ్ (43) అనే వ్యక్తి పిల్లాడిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ పిల్లోడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీంతో మిగతా పిల్లలంతా ప్రాణభయంతో పరుగుల తీస్తూ గ్రామంలోకి వచ్చి తోటలో జరిగిన విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత గ్రామస్తులు మామిడి తోటలోకి వెళ్లేలోపే రామాశీష్ పారిపోయాడు. ఈ కిరాతక చర్యపై సత్యం కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments