Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం: శిక్షణలో ఉన్న క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం!

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (12:27 IST)
కామాంధులు దేశంలో రెచ్చిపోతున్నారు. దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శిక్షణలో ఉన్న ఓ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు గురువారం ఫిర్యాదు చేసినట్లు బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ శరత్ చంద్ర చెప్పారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హెన్నూర్ పరిసరాల్లో ఉన్న సిస్టర్స్ ఆఫ్ హోలీ నేటివిటీలో ఓ 17 ఏళ్ల బాలిక సన్యాసినిగా శిక్షణ పొందుతోంది. భవనంలోని కింది అంతస్తులో ఉన్న తన గదిలో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తట్టారు.
 
తలుపు తీయడంతోనే విద్యార్థినిని తోసేసి లోపలికి ప్రవేశించిన దుండగులు ఆమెపై అత్యాచారం జరిపారు. దీంతో విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత దుండగులు పారిపోయారు. దీనిపై ఆశ్రమ నిర్వాహకురాలికి విషయాన్ని నివేదించిన బాధితురాలు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments