Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం చేసిన స్నేహితులు - నిందితుల్లో ముగ్గురు మైనర్లు

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (18:45 IST)
గుజరాత్ రాష్ట్రంలోని డాంగ్ జిల్లాలో దారుణం జరిగింది. 14 యేళ్ల బాలికపై స్నేహితులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... డాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక రెండు నెలల క్రితం పక్క ఊరిలో జరిగిన ఓ వివాహానికి హాజరై ఇంటికి వస్తున్నది. ఆ సమయంలో ఆమెను మైనర్ స్నేహితుడు బలవంతంగా కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో వచ్చే దారిలో మరో 8 మంది స్నేహితులు కలిసి ఆ బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో 9 మంది నిందితుల్లో ఆరుగురు 20 యేళ్ళలోపు వారు కాగా, మరో ముగ్గురు మైనర్లు. పైగా, వీరు చేసిన పాడుపని ఓ మైనర్ బాలుడు వీడియో తీశాడు. 
 
ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వ్యక్తులను చూసి బాలికను అక్కడే వదిలివేసి పరారయ్యారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను ఆ కామాంధులు బెదిరించారు. అయితే, ఈ అత్యాచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... కేసు నమోదు చేసి ఈ నెల 24వ తేదీన 9 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిందరిపై పోక్సో చట్ట కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు గుజరాత్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments