Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకొట్టు వ్యాపారికి రూ.109 కోట్లు జీఎస్టీ బిల్లు.. వామ్మో అంటూ గుండె పట్టుకున్నాడు..

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (11:29 IST)
Tea Stall
టీకొట్టు వ్యాపారికి జీఎస్టీ బకాయి కింద రూ.109 కోట్లు జమచేయాలని నోటీసులు జారీ అయ్యాయి. అంతే రెక్కాడితే డొక్కాడని ఆ టీ కొట్టు వ్యాపారికి షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్‌ రౌర్కెలా కోయల్‌నగర్‌ లింగరాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ షాపింగ్‌మాల్‌ ఆవరణలో టీకొట్టు నడుపుకుంటున్నాడు. అలాగే కూరగాయల చిల్లర వ్యాపారం చేస్తుంటాడు. వీటితో చేతికి అందిన చిరు మొత్తంతో కుటుంబం నడుపుకుంటున్న సాదాసీదా వ్యక్తి. 
 
సంతకం చేయడం రాని నిరక్షరాశ్యుడు. ఈ వ్యక్తిని ట్రేడింగ్‌ కంపెనీ యజమానిగా, భారీ భవంతి అద్దెకు నడుపుతున్నట్లు పేర్కొని, నోటీసులు జారీ చేయడంతో షాక్ తప్పలేదు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది.
 
జీఎస్‌టీ ఎగవేత తాఖీదులో పేర్కొన్న లింగరాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ షాపింగుమాల్‌ ఆవరణలో టీకొట్టు, అక్కడే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తి కార్తీక్‌ కమిలగా విచారణలో తేలింది. విచారణలో పలు అంశాలను సమీక్షించడంతో తాఖీదులో వివరాలు బూటకమని స్పష్టమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం