Webdunia - Bharat's app for daily news and videos

Install App

సభలోనే డీఎంకే ఎమ్మెల్యేల ధర్నా.... జత కలిసిన పన్నీర్ వర్గీయులు

తమిళనాడు అసెంబ్లీలో రచ్చరచ్చ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధనపాల్ సస్పెండ్ చేశారు. అయినప్పటికీ, వారు సభ నుంచి బయటకు వెళ్లడం లేదు. దీంతో వారిని బయటకు తీసుకెళ్లడంలో మార్షల్స్ కూడా విఫలమయ్యారు.

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (14:29 IST)
తమిళనాడు అసెంబ్లీలో రచ్చరచ్చ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధనపాల్ సస్పెండ్ చేశారు. అయినప్పటికీ, వారు సభ నుంచి బయటకు వెళ్లడం లేదు. దీంతో వారిని బయటకు తీసుకెళ్లడంలో మార్షల్స్ కూడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తమపై సస్పెన్షన్ విధించినందుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు సభలో ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు కూడా సభలోకి వెళ్లారు. వారితో పాటే సభలో బైఠాయించి నిరసన వ్యక్తంచేస్తున్నారు. 
 
దీంతో తమిళనాడు అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష కోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన వెంటనే పన్నీర్ వర్గం, డీఎంకే సభ్యులు సీక్రెట్ ఓటింగ్‌కు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు కొందరు ఏకంగా స్పీకర్ చొక్కా పట్టి లాగి, ఆయన కుర్చీలో కూడా కూర్చున్నారు. 
 
ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. ఈ క్రమంలో, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను స్పీకర్ చర్చకు ఆహ్వానించారు. ఈ చర్చ సందర్భంగా కూడా రహస్య ఓటింగ్ జరపాల్సిందేనంటూ స్టాలిన్ పట్టుబట్టారు. దీంతో, ఓటింగ్ ప్రక్రియ మరింత గందరగోళంగా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments