Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కేసులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయండి : తమిళ రాజకీయ పార్టీలు!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (18:35 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని తమిళనాడు రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైగా.. కోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు ప్రకటించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమిళ పార్టీలు కోరాయి. 
 
డీఎంకే అధినేత కరుణానిధి సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఈ మేరకు విన్నవించాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు తీర్పుల్లో చాలా వ్యత్యాసముందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇళంగోవన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం అప్పీలు చేయాలని కోరారు. అయితే జయ కేసులో హైకోర్టు తీర్పును తాను ఊహించలేకపోయానని డీఎండీకే చీఫ్, అసెంబ్లీ విపక్ష నేత, సినీనటుడు విజయకాంత్ అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాస్ కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు తీర్పు చెప్పిందో అర్థం కావడం లేదన్నారు. నేరానికి సంబంధించిన ఆధారాలు అనేకం కళ్లెదుటే కనిపిస్తున్నా నిర్దోషులుగా ప్రకటించడం శోచనీయమన్నారు. ఇది న్యాయదేవతను ఓడించడమేనని రాందాస్‌ వ్యాఖ్యానించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments