Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ అధికారులపై మంత్రుల దురుసు ప్రవర్తన.. చెన్నైకి వస్తున్న గవర్నర్.. వేటు తప్పదా?

ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (15:05 IST)
ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు.. ఇంకా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు చేపడుతున్న దళవాయ్ సుందరంను తప్పించేందుకు తమిళనాడు సర్కారుకు గవర్నర్ విద్యా సాగర్ రావు ఒత్తిడి చేస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 
 
ఇందుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామితో ఫోనులో చర్చించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఉంటున్న గవర్నర్.. మే 10వ తేదీన చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమిళ రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ అనిశ్చితి, ఆర్కే నగర్ ఎన్నికల్లో అవినీతి, మంత్రుల తొలగింపు వంటి పలు అంశాలపై డీజీపీ వద్ద చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇంకా సీఎం పళనిసామితో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఐటీ అధికారులపై దాడికి పాల్పడిన మంత్రులను తొలగించాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments