నీట్ దెబ్బకు విద్యార్థిని సూసైడ్.. రజనీకాంత్‌ విచారం..

దేశంలోని వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన తమిళనాడుకు చెందిన విద్యార్థిని అనిత(17) సూసైడ్

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (09:37 IST)
దేశంలోని వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన తమిళనాడుకు చెందిన విద్యార్థిని అనిత(17) సూసైడ్ చేసుకుంది. అరియలూర్‌ జిల్లాలోని తన ఇంట్లో విగత జీవిగా మారింది. తమిళనాడు బోర్డు నిర్వహించిన 12వ తరగతి తుది పరీక్షల్లో 1200 మార్కులకుగానూ అనిత 1176 మార్కులు సాధించింది. 
 
కానీ, నీట్‌ పరీక్షలో అర్హత సాధించలేకపోయింది. మెడిసిన్‌ చేయడానికి నీట్‌ను తప్పని సరిచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల తనలాంటి విద్యార్థులు చాలా మంది నష్టపోతున్నారని, తమిళనాడు బోర్డు పరిధిలో విద్యనభ్యసించిన వారికి ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
కోర్టు తీర్పు అనేక మంది ఔత్సాహిక వైద్య విద్యార్థులకు శరాఘాతంగా మారింది. ఈ నేపథ్యంలో నీట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేదన్న బాధతో ఆత్మహత్మ హత్య చేసుకుంది. అనిత మృతి పట్ల సినీనటుడు రజనీకాంత్‌ విచారం వ్యక్తం చేశారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments