Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్.. ఆదివారం నో పర్మిషన్

Webdunia
గురువారం, 30 జులై 2020 (14:42 IST)
దేశంలో రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
 
లాక్‌డౌన్‌ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
అలాగే ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించనుండగా.. మిగిలిన రోజుల్లో కొన్నింటిని సడలింపులు ఇవ్వడం జరిగింది. అంతరాష్ట్ర రవాణాపై నిషేధం కొనసాగనుంది. అంతర్‌జిల్లా ప్రయాణానికి ఈ-పాస్‌ తప్పనిసరి చేసింది. 
 
పార్కులు, బీచ్‌లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుందని తెలిపింది. తమిళనాడులో ప్రస్తుతం 57వేల కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1.7లక్షలకు పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి 3,471 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments