Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లి పేరుతో ఆ దంపతులు ఎంత నీచానికి తెగించారంటే...!

జల్సాలకు అలవాటు పడిన ఆ దంపతులు... అన్నాచెల్లి పేరుతో చేయకూడని పనులు చేశారు. అనేక మంది యువతులను మోసగించి 100 సవర్ల మేరకు బంగారం దోచుకోవడమే కాకుండా, 20 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి

Webdunia
గురువారం, 28 జులై 2016 (08:36 IST)
జల్సాలకు అలవాటు పడిన ఆ దంపతులు... అన్నాచెల్లి పేరుతో చేయకూడని పనులు చేశారు. అనేక మంది యువతులను మోసగించి 100 సవర్ల మేరకు బంగారం దోచుకోవడమే కాకుండా, 20 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా తిరువేంబుయూర్‌కి చెందిన ఓ కళాశాల విద్యార్థిని రెండేళ్ల క్రితం అదృశ్యమైంది. దీని గురించి విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని కోసం పలు చోట్ల గాలించారు. ఇంతలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి నావలంపట్టు పోలీసు స్టేషన్‌లో హాజరై ఓ యువకుడు తనను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ధరించిన 8 సవర్ల నగలు కూడా అపహరించి పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఆ యువకుడికి అతడి సోదరి కూడా సహకరించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొంటూ.. ఆ ఇద్దరి ఫోటోలను కూడా ఇచ్చింది. ఈ ఫోటోల ఆధారంగా వారి కోసం తీవ్రంగా గాలింపుచర్యలు చేపట్టగా, వారిద్దరు తిరుచ్చి బస్టాండ్‌లో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద జరిపిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తిరుప్పూర్‌ జిల్లాకు చెందిన గురు దీన దయాళన్ అనే పట్టభద్రుడైన ఆ యువకుడు నిరుద్యోగి. ఫేస్‌బుక్‌లో యువతులతో పరిచయం పెంచుకుని, వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే 2013వ సంవత్సరం ప్రియదర్శినిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడని, ఆడంబరమైన జీవితాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో దంపతులు ఓ కొత్త పథకానికి తెరతీసినట్లు తెలిసింది. 
 
గురు దీనదయాళన్ ఫేస్‌బుక్‌ ద్వారా మహిళలను తన వలలో పడేసి పారిపోయి వివాహం చేసుకోవడానికి నగలతో రావాలని నమ్మించి రప్పించుకునేవాడు. అతడి మాటలు నమ్మిన యువతులు అలాగే వచ్చి మోసపోయేవారని, వచ్చిన యువతులకు గురు దీనదయాళన్, ప్రియదర్శినిలు అన్న, చెల్లిగా పరిచయం చేసుకునేవారని తెలిసింది. ఇప్పటివరకు నిందితుడు 20 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడి 100 సవర్లకు పైగా నగలు దోచుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments