Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు భారతరత్న ఇవ్వండి.. రూ.15కోట్లతో స్మారక మందిరం నిర్మించాలి

మాజీ సీఎం జయలలితకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని, జయ కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. జయమరణానంతరం సీఎం బాధ్యతలు చేపట్టి

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (12:08 IST)
మాజీ సీఎం జయలలితకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని, జయ కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. జయమరణానంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన ఒ.పన్నీర్‌ సెల్వం శనివారం తన మంత్రివర్గ సహచరులతో తొలిసారి భేటీ అయ్యారు. అంతకుముందు మెరీనాకు వెళ్లి జయలలిత, ఎంజీఆర్‌ సమాధుల వద్ద ఆశీస్సులు పొందిన పన్నీర్‌ సెల్వం బృందం పోయెస్‌ గార్డెన్‌లో చిన్నమ్మ శశికళ దీవెనలూ పొందింది.
 
అదేవిధంగా జయలలిత పార్ధివదేహాన్ని ఖననం చేసిన ప్రాంతంలో రూ.15 కోట్లతో స్మారక మందిరం నిర్మించాలని, రాష్ట్ర అసెంబ్లీలో చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, భారతరత్న డాక్టర్‌ ఎంజీఆర్‌ సమాధి పేరును ''భారతరత్న డాక్టర్‌ పురచ్చితలైవర్‌ ఎంజీఆర్‌''గా మార్చడంతో పాటు జయ సమాధికి ‘పురచ్చితలైవి అమ్మ సెల్వి జె.జయలలిత స్మారక మందిరం’గా పేరు పెట్టాలని మంత్రివర్గం తీర్మానించింది.
 
ఇదిలా ఉంటే.. టీస్టాల్ ఓనర్‌గా జీవితం ప్రారంభించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం అయ్యారు. పన్నీర్ సెల్వం ఇప్పుడు అమ్మకు వారసుడయ్యారు. తనకు అవసరమైనప్పుడు సీఎం సీట్లో సెల్వాన్ని జయ కూర్చోబెట్టారు. సెల్వమే ఇప్పుడు ఆమె ఖాళీ చేసిన వెళ్లిన సీట్లో కూర్చున్నారు. అక్రమాస్తుల కేసులో జయ జైలుకెళ్లినప్పుడు, అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో వున్నప్పుడు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్‌సెల్వం తన టేబుల్‌పై ముందు భాగంలో ఆమె ఫోటో వుండేలా జాగ్రత్త తీసుకునేవారు. 
 
అదేవిధంగా మంత్రివర్గానికి నేతృత్వం వహించినా అధ్యక్ష స్థానంలో మాత్రం కూర్చునేవారు కాదు. అయితే శనివారం జరిగిన భేటీలో జయ ఫోటో తన వెనుక వుండేలా కూర్చున్నారు. అంతేగాకుండా ఆయన తొలిసారిగా మంత్రివర్గ అధ్యక్షుడి స్థానంలో కూర్చున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments