Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో రవాణా కార్మికుల సమ్మె : స్తంభించిన ప్రజారవాణా

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. వేతన పెంపుతోపాటు పీఎఫ్‌ బకాయిలను తక్షణం చెల్లించాలన్న ప్రధాన డిమాం

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:26 IST)
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. వేతన పెంపుతోపాటు పీఎఫ్‌ బకాయిలను తక్షణం చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో రవాణా కార్మికులు గత గురువారం నుంచి సమ్మెకు దిగారు. ఈ సమ్మె విరమణ కోసం ప్రభుత్వం పలు దఫాలుగా జరిగిన చర్చలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. తమ పీఎఫ్ బకాయిలను తక్షణం చెల్లించాల్సిందేనని రవాణా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 
 
మరోవైపు సమ్మెను తక్షణం విరమించాలని కోరుతూ హైకోర్టు ఆదేశించినప్పటికీ.. కార్మికులు ఖాతరు చేయలేదు. పైగా సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులోభాగంగా, మంగళవారం నుంచి రవాణా కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదిలావుంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు డ్రైవర్లుగా మారి ఒకరోజు బస్సులను నడిపారు. ఆతర్వాత వీరంతా పత్తాలేకుండా పోయారు. 
 
ఇంకోవైపు, సంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకు నగర వాసులు ఉత్సాహంతో ఉన్నారు. అయితే, అన్ని రకాల బస్సు సేవలు అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అదేసమయంలో రైళ్ళలో తీవ్రమైన రద్దీ నెలకొనివుంది. దీంతో దక్షిణ రైల్వే అదనపు రైళ్లను నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments