Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలు.. తమిళనాడులో స్కూల్స్, కాలేజీలు బంద్.. వర్క్ ఫ్రమ్ హోమ్

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (09:12 IST)
భారీ వర్షాల సూచనల నేపథ్యంలో తమిళనాడు అధికారులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. అక్టోబర్ 18 వరకు ఉద్యోగులు రిమోట్‌గా పని చేయడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి  స్టాలిన్ ఈ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు సూచించారు. 
 
తమిళనాడులో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబరు 14-16 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ నివేదించింది. వర్షాకాలానికి సన్నాహకంగా సీఎం స్టాలిన్‌ సన్నద్ధత చర్యలపై సమీక్ష నిర్వహించారు. 
 
చెన్నై కార్పొరేషన్ 990 పంపులు, 57 ట్రాక్టర్లను పంపు సెట్లతో సిద్ధంగా ఉంచింది. అదనంగా, 36 మోటర్‌బోట్‌లు, బ్లీచ్ పౌడర్, లైమ్ పౌడర్, ఫినాయిల్ వంటి అవసరమైన సామాగ్రిని రెడీ చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments