Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలు.. తమిళనాడులో స్కూల్స్, కాలేజీలు బంద్.. వర్క్ ఫ్రమ్ హోమ్

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (09:12 IST)
భారీ వర్షాల సూచనల నేపథ్యంలో తమిళనాడు అధికారులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. అక్టోబర్ 18 వరకు ఉద్యోగులు రిమోట్‌గా పని చేయడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి  స్టాలిన్ ఈ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు సూచించారు. 
 
తమిళనాడులో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబరు 14-16 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ నివేదించింది. వర్షాకాలానికి సన్నాహకంగా సీఎం స్టాలిన్‌ సన్నద్ధత చర్యలపై సమీక్ష నిర్వహించారు. 
 
చెన్నై కార్పొరేషన్ 990 పంపులు, 57 ట్రాక్టర్లను పంపు సెట్లతో సిద్ధంగా ఉంచింది. అదనంగా, 36 మోటర్‌బోట్‌లు, బ్లీచ్ పౌడర్, లైమ్ పౌడర్, ఫినాయిల్ వంటి అవసరమైన సామాగ్రిని రెడీ చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments