Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని పెళ్లాడిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:04 IST)
ప్రేమించి మోసం చేసే ప్రియులు ఎక్కువైన ఈ రోజుల్లో అదీ ఓ రాజకీయ నేత తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. అదీకూడా అధికార అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యే కావడం గమనార్హం. 
 
ఆయన పేరు ప్రభు. తమిళనాడులోని కళ్లకురిచ్చి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. త్యాగదుర్గం మలైకొటై గ్రామానికి చెందిన సౌందర్య అనే బీఏ ఇంగ్లీష్ రెండో సంవత్సరం చదువుతున్న యువతిని గడచిన ఏడాదిన్నరగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యే యువతి కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు కూడా వివాహానికి సమ్మతించారు. దీంతో ఇరు కుటుంబాల సమ్మతితో ఈ వివాహం జరిగింది. 
 
కాగా, కరోనా నేపథ్యంలో, తక్కువ మంది అతిథుల మధ్య, నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. సౌందర్య తండ్రి గ్రామంలో అర్చకుడిగా పని చేస్తున్నారు. నూతన దంపతులకు పలువురు రాజకీయ నాయకులు ఆశీస్సులు, అభినందనలు అందించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments