Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు ఇంజెక్షన్ బదులు టాబ్లెట్​!

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (20:03 IST)
కరోనా మహమ్మారితో సీరియస్​ అవుతున్న పేషెంట్లకు ఇప్పుడు రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లతో ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దానిని టాబ్లెట్ల రూపంలో ఇచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరో ‘టాబ్లెట్​’ కరోనాను తగ్గిస్తోందట.

ఇప్పటికే ఫ్లూ కోసం వాడుతున్న మోల్నుపిరావిర్​ (ఎంకే 4482) అనే మందు హామ్​స్టర్స్​ (ఓ రకం ఎలుకలు)పై బాగా పనిచేస్తోందట. అమెరికాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్(ఎన్​ఐహెచ్​)కు చెందిన సైంటిస్టులు ఎలుకలకు ఈ మందులిచ్చి చూడగా మంచి ఫలితాలు వచ్చినట్టు తేలింది.

వైరస్ సోకడానికి 12 గంటల ముందు, సోకిన 12 గంటల తర్వాత కూడా మోల్నుపిరావిర్​ బాగా పనిచేస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి లంగ్స్​కు చేసే చెడును కూడా చాలా వరకు తగ్గించగలిగిందని అంటున్నారు.

కాబట్టి కరోనా బాధితులకు మోల్నుపిరావిర్​తో ట్రీట్​మెంట్​ చేస్తే మహమ్మారి తీవ్రతను తగ్గించొచ్చని సిఫార్సు చేస్తున్నారు.

మనుషులపై ఈ మందు పనితీరును తెలుసుకునేందుకు చేస్తున్న క్లినికల్​ ట్రయల్స్​తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. మొత్తం ట్రయల్స్​ పూర్తయ్యాక మోల్నుపిరావిర్​ పనితీరును వెల్లడిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments