కరోనాకు ఇంజెక్షన్ బదులు టాబ్లెట్​!

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (20:03 IST)
కరోనా మహమ్మారితో సీరియస్​ అవుతున్న పేషెంట్లకు ఇప్పుడు రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లతో ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దానిని టాబ్లెట్ల రూపంలో ఇచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరో ‘టాబ్లెట్​’ కరోనాను తగ్గిస్తోందట.

ఇప్పటికే ఫ్లూ కోసం వాడుతున్న మోల్నుపిరావిర్​ (ఎంకే 4482) అనే మందు హామ్​స్టర్స్​ (ఓ రకం ఎలుకలు)పై బాగా పనిచేస్తోందట. అమెరికాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్(ఎన్​ఐహెచ్​)కు చెందిన సైంటిస్టులు ఎలుకలకు ఈ మందులిచ్చి చూడగా మంచి ఫలితాలు వచ్చినట్టు తేలింది.

వైరస్ సోకడానికి 12 గంటల ముందు, సోకిన 12 గంటల తర్వాత కూడా మోల్నుపిరావిర్​ బాగా పనిచేస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి లంగ్స్​కు చేసే చెడును కూడా చాలా వరకు తగ్గించగలిగిందని అంటున్నారు.

కాబట్టి కరోనా బాధితులకు మోల్నుపిరావిర్​తో ట్రీట్​మెంట్​ చేస్తే మహమ్మారి తీవ్రతను తగ్గించొచ్చని సిఫార్సు చేస్తున్నారు.

మనుషులపై ఈ మందు పనితీరును తెలుసుకునేందుకు చేస్తున్న క్లినికల్​ ట్రయల్స్​తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. మొత్తం ట్రయల్స్​ పూర్తయ్యాక మోల్నుపిరావిర్​ పనితీరును వెల్లడిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments