Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో స్నేహం చేస్తూనే నా భార్యనే ఉంచుకుంటావా?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (08:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మాజీ కానిస్టేబుల్ తన స్నేహితుడుని కాల్చి చంపాడు. తనతో స్నేహం చేస్తూనే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా పాలషిపర పట్టణానికి చెందిన బిభాష్ మండల్, సుభాష్ బిశ్వాస్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణస్నేహితులు. వీరిలో బిభాష్ మండల్ సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. 
 
ఈ క్రమంలో బిభాష్ మండల్ భార్యతో సుభాష్ బిశ్వాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీన్ని గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బిభాష్ మండల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
అంతే.. తుపాకీ తీసుకొచ్చి ఓ దుకాణం వద్ద ఉన్న సుభాష్ బిశ్వాస్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వా బిభాస్ అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments