నాతో స్నేహం చేస్తూనే నా భార్యనే ఉంచుకుంటావా?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (08:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మాజీ కానిస్టేబుల్ తన స్నేహితుడుని కాల్చి చంపాడు. తనతో స్నేహం చేస్తూనే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా పాలషిపర పట్టణానికి చెందిన బిభాష్ మండల్, సుభాష్ బిశ్వాస్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణస్నేహితులు. వీరిలో బిభాష్ మండల్ సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. 
 
ఈ క్రమంలో బిభాష్ మండల్ భార్యతో సుభాష్ బిశ్వాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీన్ని గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బిభాష్ మండల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
అంతే.. తుపాకీ తీసుకొచ్చి ఓ దుకాణం వద్ద ఉన్న సుభాష్ బిశ్వాస్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వా బిభాస్ అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments