సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టడానికి ముందు.. దర్గా వద్ద ప్రార్థనలు చేసిన భారత జవాన్లు...
యురీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి అడుగుపెట్టి.. సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఈ మెరుపు దాడులతో పాకిస్థాన్ నివ్వెర పోయింది. అలాగే, భారత్ జరిపిన దాడులకు ప్రపంచ వ్యాప్తంగా
యురీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి అడుగుపెట్టి.. సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఈ మెరుపు దాడులతో పాకిస్థాన్ నివ్వెర పోయింది. అలాగే, భారత్ జరిపిన దాడులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మద్దతు కూడా లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ... ఈ దాడులకు వెళ్లే ముందు భారత ఆర్మీ ఏం పని చేసిందో ఓ సారి తెలుసుకుంటే పతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు దేవుడికి మొక్కుకోవడం సహజం. ఆపరేషన్లు చేపట్టేటప్పుడు మన జవాన్లు కూడా ప్రార్థనలు చేయడం సాధారణమే. పీవోకేలో సర్జికల్ దాడులు చేయడానికి ముందు కూడా అక్కడి దర్గాలో 6 బీహార్, 10 డోగ్రా యూనిట్ల జవాన్లు ప్రార్థనలు జరిపారు.
ఈ దర్గా భారత సరిహద్దుల్లోనే నవ్కోట్, చని గ్రామాల్లో ఉంటుంది. 1971 యుద్ధంలో ఇక్కడి ప్రజలంతా వలస పోయారు. దాంతో ఈ దర్గాను పట్టించుకునేవారు కరువయ్యారు. మన సైనికులు కూడా ఇది పాకిస్థాన్ దర్గా అని కొన్ని దశాబ్దాలపాటు అనుకున్నారు. కానీ, ఓ పశువుల కాపరి అందులో చిక్కుకుని ఆర్తనాదాలు చేయడంతో మనవాళ్లు రక్షించారు. అతడికే దర్గా సంరక్షణ బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ దర్గా వద్ద సైనికులు ప్రార్థనలు చేసి సర్జికల్ స్ట్రైక్స్ను విజయవంతంగా పూర్తి చేశారు.