Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక స్త్రీ పురుషుడు దీర్ఘకాలం కలిసివుంటే పెళ్లి జరిగినట్టే : సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (14:09 IST)
ఒక స్త్రీ, ఒక పురుషుడు దీర్ఘకాలం కలిసివుంటే వారికి పెళ్లి జరిగినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే, సుధీర్ఘకాలం సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహ బంధంగా పరిగణిస్తుందని, దాన్ని అక్రమ సంబంధంగా భావించకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పైగా, అలాంటి జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటాను నిరాకరించరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన ఓ జంట సుధీర్ఘకాలం పాటు సహజీవనం చేసింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేకపోవడం వల్ల.. వారికి పుట్టిన 'అక్రమ' సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని కేరళ హైకోర్టు 2009లో తీర్పునిచ్చింది. 
 
దీనిపై బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది. 'ఒక జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సాగారంటే వారు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలి. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 114 ఈ మేరకు సూచిస్తోంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్పించే వారి బంధాన్ని ఈ విధంగానే పరిగణించాలి' అని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments