Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీల శరీరాలు దేవాలయాలు... అత్యాచార కేసు రాజీపై సుప్రీంకోర్టు తీర్పు

Webdunia
బుధవారం, 1 జులై 2015 (15:09 IST)
అత్యాచారం కేసుల్లో రాజీ యత్నాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబడుతూ కీలక తీర్పును వెలువరించింది. అత్యాచారం చేయడమే కాదు, అత్యాచార కేసుల్లో రాజీ యత్నాలు చేయడం కూడా తప్పేనంటూ బుధవారం స్పష్టం చేసింది. ఎందుకంటే మహిళలు తమ శరీరాలను దేవాలయాల్లాగా భావిస్తారని... ఈ నేపథ్యంలో అత్యాచార కేసుల్లో రాజీ చేయాలనుకుంటే మహిళల హక్కులను హరించినట్టేనని తెలిపింది. ఈ కేసుల్లో నిందితులతో బాధితులు రాజీపడినా నేరమేనని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. 
 
కాగా, ఇటీవల మద్రాసు హైకోర్టు ఓ అత్యాచార కేసులో బాధితురాలితో రాజీ కోసం ముద్దాయికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఫలితంగా ఆ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి వివరణ కూడా ఇచ్చారు. ఈ తీర్పును ఇపుడు సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. అత్యాచార నిందితులకు కఠినమైన శిక్షలను అమలు చేయాలని స్పష్టం చేసింది. 
 
లైంగికదాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతకవైఖరిని అవలంభించినట్టేనని అత్యుతున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమే కాకుండా, మహిళల గౌరవానికి వ్యతిరేకమైనదని తెలిపింది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments