Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతి కేసు విచారణపై స్టే : సుప్రీంకోర్టు ఆదేశం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:21 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణపై స్టే విధించింది. విచారణ పేరుతో కమిషన్ తమ వైద్యులను వేధిస్తోందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. 
 
కాగా, అమ్మ మరణంలో ఉన్న మిస్టరీని ఛేదించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కాలపరిమితి గతంలో ముగియగా, దాన్ని ప్రభుత్వం పొడగించింది కూడా. 
 
ఈ కమిషన్ విచారణలో భాగంగా, జయలలితకు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ప్రధాన నర్సులు, పలువురు మంత్రులు, శశికళ బంధువులు, ఇలా అనేక మందిని విచారించారు. ఈ కేసు విచారణలోభాగంగా అపోలో ఆస్పత్రి యాజమానికి మరోమారు కమిషన్ నోటీసులు జారీ చేసింది. 
 
అయితే, ఈ విచారణ పేరుతో తమ ఆస్పత్రి వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ మద్రాసు హైకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారించిన కోర్టు... కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అపోలో యాజమాన్యం ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... అర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. దీంతో జయలలిత మృతిలో ఉన్న మిస్టరీ.. ఓ మిస్టరీగానే మారిపోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments