Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (15:33 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెరాస సర్కారుకు కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టంచేసింది.
 
తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య అత్యధికంగా ఉండటంతో రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరాగా రిజర్వేషన్లు పెంచడం కుదరని పని అని అసలు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు వెలువరించింది.
 
అయితే, తెరాస సర్కారుకు ఎస్సీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుకై పోరాటం చేస్తామని తెరాస సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీఇచ్చింది. అయితే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేసింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments