Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు సుప్రీం నోటీసులు.. అద్వానీకి ముందు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (06:58 IST)
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నాయకులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో పాటు 15 మంది ఉన్నారు. నాటి ఘటనపై స్పందించి వివరణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేరపూరిత కుట్ర దాగి ఉందన్న కోణంలో వీరు విచారణ ఎదుర్కొంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తదితరులపై నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీలోని సెక్షన్ 120బీ అభియోగాన్ని తొలగించారు. దీనిపై సవాలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణకు వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం మారినందువల్ల సీబీఐ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించే అవకాశముందంటూ హాజీ మొహమ్మద్ అహ్మద్ వేశారు. చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాల ధర్మాసనం సీబీఐకి, అద్వానీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. 
 
అంతకుముందు, బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీ సహా 19 మందిపై ‘నేరపూరిత కుట్ర’ ఆరోపణను తొలగిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేరపూరిత కుట్రను ఎందుకు తీసేయాలో చెప్పాలంటూ బీజేపీ నేతలు మురళీమనోహర్ జోషి, ఉమాభారతి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌తో పాటు మరో 15 మందికి ఈ నోటీసులు అందాయి.
 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments