Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్‌-పీజీ 2021: పాత సిలబస్‌నే పునరుద్ధరించాలి.. సుప్రీం కోర్టు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:08 IST)
నీట్‌-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్‌నే పునరుద్ధరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణలో కేంద్రం, జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై అక్షింతలు వేసింది. పాత సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని ఆదేశించింది.
 
ఈ అంశంపై బుధవారం కూడా విచారణ జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. దీంతో పాత సిలబస్‌తోనే నీట్ పీజీ నిర్వహణతోపాటు పరీక్షా తేదీలను మార్చే విషయమై తుది నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి కోర్టు ఒకరోజు గడువు ఇచ్చింది.
 
వైద్య విద్యాభ్యాసం, వైద్యవృత్తి నిర్వహణకు రూపొందించిన నిబంధనలు దాన్ని వ్యాపారంగా మార్చేలా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తమకు అధికారం ఉందని యువ డాక్టర్లను ఫుట్‌బాల్ ఆడుకోవద్దని ఇంతకుముందు విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
 
దీనిపై సోమవారం కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం.. సవరించిన సిలబస్‌తోనే నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. అయితే, విద్యార్థులు ప్రిపేర్ కావడానికి పరీక్షను రెండు నెలలు వాయిదా వేస్తామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments