Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూత

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (12:48 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి శాంతనగౌడర్ కన్నుమూశారు. 
2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన... అంతకుముందు కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు.
 
అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన 63 యేళ్ల ఎం.శాంతనగౌడర్ చనిపోయినట్టు మేరకు సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గగన్ సోని తెలిపారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.
 
ఉత్తర కర్ణాటకలోని ధర్వాడ్‌కు చెందిన జస్టిస్ శాంతనగౌడర్ 17 ఫిబ్రవరి 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 4 మే 2023న రిటైర్ కావాల్సి ఉంది. 1980లో అడ్వకేట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన సివిల్, క్రిమినల్, రిట్ పిటిషన్ల కేసులు చేపట్టేవారు. 
 
2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శాంతనగౌడర్ 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రావడానికి ముందు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments