Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూత

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (12:48 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి శాంతనగౌడర్ కన్నుమూశారు. 
2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన... అంతకుముందు కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు.
 
అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన 63 యేళ్ల ఎం.శాంతనగౌడర్ చనిపోయినట్టు మేరకు సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గగన్ సోని తెలిపారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.
 
ఉత్తర కర్ణాటకలోని ధర్వాడ్‌కు చెందిన జస్టిస్ శాంతనగౌడర్ 17 ఫిబ్రవరి 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 4 మే 2023న రిటైర్ కావాల్సి ఉంది. 1980లో అడ్వకేట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన సివిల్, క్రిమినల్, రిట్ పిటిషన్ల కేసులు చేపట్టేవారు. 
 
2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శాంతనగౌడర్ 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రావడానికి ముందు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shashti purthi : రాజేంద్రప్రసాద్ నటించిన షష్టి పూర్తి మూవీ రివ్యూ

పోలీస్ కంప్లెయింట్ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments