Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లడ్డూల్లో జంతు కొవ్వు.. సీబీఐ విచారణ.. పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

సెల్వి
శుక్రవారం, 8 నవంబరు 2024 (13:09 IST)
వైఎస్ జగన్ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 
 
సామాజిక కార్యకర్త, 'గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్' సంస్థ అధ్యక్షుడు అయిన పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. పాల్ విజ్ఞప్తి మేరకు అన్ని దేవాలయాలయాల ప్రసాదాలను పరిశీలించే అంశం అనేది అంత సులువు కాదని సుప్రీం పేర్కొంది.
 
లడ్డూ ప్రసాదం కొనుగోలు, తయారీలో అవినీతి, నిర్వహణలో లోపాలున్నాయని వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమగ్ర దర్యాప్తు జరిపించాలని పాల్ తన పిటిషన్‌లో కోరారు. కాగా ఇప్పటికే తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును వినియోగించారనే ఆరోపణలపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ను అక్టోబర్ 4న సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
 
కల్తీ నెయ్యితో సహా 'లడ్డూ ప్రసాదం' తయారీలో నాసిరకం పదార్థాలను ఉపయోగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని, ఈ పవిత్ర ప్రసాదం పవిత్రతను దెబ్బతీస్తున్నాయని పాల్ తన పిల్‌లో పేర్కొన్నారు.
 
మతాన్ని ఆచరించడానికి, ప్రచారం చేయడానికి స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉటంకిస్తూ, పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలు, ప్రాథమిక మత హక్కుల ఉల్లంఘనను పిటిషన్ నొక్కి చెప్పింది.
 
రాజకీయ అవకతవకలు, అవినీతి మన పవిత్ర సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా చూడాలని భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ పిటిషన్‌ దాఖలు చేశానని పాల్‌ తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments