Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద హత్య కేసు.. నిజాలన్నీ శశిథరూర్‌కు తెలుసు : అమర్ సింగ్

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (11:37 IST)
సునంద హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం (సిట్) ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద బుధవారం రెండు గంటల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సునంద హత్యకు దారితీసిన పరిస్థితులు, ఐపీఎల్ వివాదంపై అమర్ సింగ్ వద్ద సిట్ బృందం సభ్యులు ప్రశ్నల వర్షం గుప్పించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, సునంద చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఐపీఎల్ వివాదంపై తనతో మాట్లాడారని అమర్‌సింగ్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ విషయంలో ఆరోపణలన్నింటినీ తన భర్త కోసం కావాలనే తనపై వేసుకున్నానని, నిజానిజాలన్నీ శశిథరూర్‌కి మాత్రమే తెలుసునని సునంద తనతో అన్నట్లు అమర్ పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని క్షుణ్ణంగా ప్రశ్నించినట్లు సమాచారం. థరూర్ కుటుంబానికి సన్నిహితుడిగా చెప్పుకొనే అమర్‌సింగ్ నుంచి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. థరూర్ దంపతుల మధ్య ఎలాంటి బంధం ఉండేది, ఐపీఎల్ వివాదం, పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో శశిథరూర్‌కు సంబంధాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమర్‌సింగ్‌కు సునంద ఏమైనా చెప్పారా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments