Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే దేశ ద్రోహులు కంటే.. శశికళ వంటి అవినీతిపరులు బెస్ట్ : సుబ్రమణ్య స్వామి

తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో డీఎంకే వంటి దేశ ద్రోహుల కంటే.. శశికళ వంటి అవినీతిపరులు ఉండటం ఎంతో మేలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. అన్నాడీఎంకే ఏర్పడిన

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (15:19 IST)
తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో డీఎంకే వంటి దేశ ద్రోహుల కంటే.. శశికళ వంటి అవినీతిపరులు ఉండటం ఎంతో మేలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. అన్నాడీఎంకే ఏర్పడిన తిరుగుబాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళే ఉండాలని స్వామి గట్టిగా పట్టుబట్టారు. దీనికిగల కారణాలను ఆయన తాజాగా వెల్లడించారు. 
 
శశికళకు హిందుత్వ భావన ఎక్కువగా ఉందని, ఆమె దేవాలయాలకు వెళతారని, అదే, డీఎంకే వాళ్లు హిందూ వ్యతిరేకులని, ఆలయాలను ధ్వంసం చేస్తారని స్వామి అన్నారు. తమిళనాడు సీఎంగా డీఎంకేలోని దేశ ద్రోహులు ఉండటం కంటే అన్నాడీఎంకేలోని అవినీతి పరులు ఉండటమే నయమని, డీఎంకే నేతలు ప్రముఖ దేవాలయాల వ్యవహారాలపై కోర్టుల్లో కేసులు వేస్తారని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె మద్దతుదారుడు ఎడప్పాడి కె.పళని స్వామికి ఆయన మద్దతు ప్రకటించడం తెలిసిందే. పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకుంటే కేసు వేస్తానని స్వామి బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

తర్వాతి కథనం
Show comments