బతికేవున్నాడు.. కోమాలో వున్నాడని ఏడాది పాటు ఇంట్లోనే మృతదేహం

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (10:33 IST)
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఏడాది పాటు ఓ ఫ్యామిలీ మృతదేహాన్ని ఇంట్లోనే వుంచుకుంది. కనీసం మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. దీంతో డెడ్ బాడీ కుళ్లిపోయింది. ఎంతగా అంటే.. ఎముకల్లోని మజ్జ కూడా ఇంకిపోయేంతగా.. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటన యూపీ శివపురిలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన అహ్మదాబాద్​లో ఐటీలో విధులు నిర్వహిస్తూ 2021 ఏప్రిల్​ 22న మృతి చెందాడు. అయితే కుటుంబసభ్యులు అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. 
 
విమలేశ్ కనిపించకపోవడంతో గ్రామస్థులు ఆరా తీశారు. అయితే విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరినీ నమ్మించారు. 
 
కానీ పెన్షన్‌కు అప్లై చేసుకునేందుకు విమలేశ్​మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. 
 
వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విమలేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్​లో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments