Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు : రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (13:04 IST)
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంశంపై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అదీకూడా వచ్చే నెల 31వ తేదీలోపు ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ఆదేశాలిచ్చింది. 
 
వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంతో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్‌ను తీసుకునే వీలు కలుగుతుందని చెప్పింది.
 
అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగ్ దీప్ ఛొకర్‌లు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం మంగళవారం విచారణ చేసింది. కరోనాతో ఆర్థికంగా బాగా చితికిపోయిన వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు పలు ఆదేశాలు ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments